బతుకమ్మ, జుక్కల్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ బుధవారం వారి నివాసంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన విధానాల గురించి చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని దీపాదాస్ మున్షీ ఎమ్మెల్యే కు సూచించారు.