నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ నిజామాబాద్ డివిజన్ పరిధిలో అతిగా మద్యం తాగి వాహనాలు నడిపిన 24మందికి జైలు శిక్ష, 22మందికి జరిమాన విధించినట్లు ఏసీపీ ఎల్.రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాదారులు మద్యం త్రాగి వాహనాలునడుపడం వలన 46 మందికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించామని తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం నిజామాబాద్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధిలలో పలు పోలీస్ స్టేషన్ల వారిగా పట్టుబడిన వారికి సంబంధింత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి, వారిని కోర్టులో హజరు పరిచామని తెలిపారు. వారికి స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ శిక్ష విధించారు.
