బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మార్కండేయ మందిరం లో శుక్రవారం కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మీడియా ఉపాధ్యక్షులు,మండల ప్రధాన కార్యదర్శి,బోడ సాయిలు మాట్లాడుతూ క్యాలెండర్ మనిషి జీవితంలో ఎంతో అవసరమని అన్నారు. ఉదయం లేవగానే క్యాలెండర్ లోతిథి వార నక్షత్రలతో పాటుతేదీ పండుగలుచూసి దైనందిన కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. పండుగలు సంఘటితంగా జరగాలన అన్నారు. ఈ కార్యక్రమం లో సంఘం నాయకులు బోడ సాయిలు, ఊపులంచే శంకర్, మెరిగే పండరి, ఊపులంచే మహేందర్, యూ.రమేష్, మెరిగే దత్తాత్రి, యూ. మాణిక్, భూషవర్ భూషణ్,కె.అంజు, దోమల్ సుభాష్, వెంకటి, శక్కర్ కోటే విట్టల్, మెరిగే బాలాజీ తదితరులు పాల్గొన్నారు.