బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పాలసీలు చేయించగా ఆ పాలసీ బాండ్లను బుధవారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ జర్నలిస్టులకు అందజేసారు.జర్నలిస్టుల భద్రత కొరకే ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించరు. విధి నిర్వహణలో భాగంగా ఎంతో మంది జర్నలిస్టులు ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతుంటారు.ఆ సమయంలో వీరికి ఇన్సూరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గంట చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు సాయ గౌడ్, వర్ల సుధాకర్, హైమద్, యునుస్, సలీం, తదితరులు పాల్గొన్నారు.
