ఎల్లారెడ్డి ఎక్సైజ్ కార్యాలయం తనిఖీ

0 1,499

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి ఎక్సైజ్ కార్యాలయాన్నిమంగళవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ  డిప్యూటి కమిషనర్ వి. సోమిరెడ్డి తనిఖీ చేశారు. 2006 నుంచి ఇప్పటి వరకు జరిగిన, నమోదైన కేసులను, దస్త్రాలను తనిఖీ చేసి అన్ని సక్రమంగా ఉండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల రవాణా, గంజాయి పట్ల ఉక్కు పాదం మోపాలని ఎక్సైజ్ సీఐ, ఎస్ఐ సిబ్బందికి సూచించారు. గుడుంబా నిలువలు లేకుండా చూడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి, స్థానిక ఎక్సైజ్ సీఐ ఎండి.షాఖీర్ అహ్మద్, ఎస్ఐ జగన్ మోహన్, హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య, జూనియర్ అసిస్టెంట్ లు జనార్ధన్, ఆనంద్,  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.