30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

నిరుపేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

 

బతుకమ్మ, పిట్లం :  నిరుపేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూస్తానని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పిట్లం ప్రజలకు హామీ ఇచ్చారు. పిట్లం మండల కేంద్రంలోని నిర్వహించిన గ్రామ సభలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలు “రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి వాటికి అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాల అమలు, లబ్ది దారుల ఎంపిక విధానం గురించి అధికారులు ప్రజలకు వివరించి వారి అపోహలు తొలగించాలని చెప్పారు.ప్రజా ప్రభుత్వం భూమి లేని నిరుపేద రైతు కూలీలను గుర్తించి వారికి ఏడాదికి 12 వేల రూపాయలు “ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ” పేరుతో అందిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ప్రజలకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే అర్హులందరికీ నూతన రేషన్ కార్డులు జారీ చేస్తుందని అన్నారు.అదేవిధంగా  గత ప్రభుత్వం జుక్కల్ నియోజకవర్గంలో  పేదలకు ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. నేడు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి వారి సొంత ఇంటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వేణుగోపాల్ గౌడ్, కమలాకర్, ఈవో బలరాం, ఆయా శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Indiramma houses for all poor people

More articles

Latest article