25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

పాకిస్తాన్‌కు ఇండియా ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపారు

Must read

📰 Generate e-Paper Clip

అధంపుర్‌ ఎయిర్‌బేస్‌ ను సందర్శించిన మోదీ

ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న వాయుసేన సిబ్బందితో ప్రధాని సమావేశం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  పాకిస్తాన్‌కు ఇండియా ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపారని ప్రధాని మోదీ అన్నారు. పంజాబ్‌లోని అధంపుర్‌ ఎయిర్‌బేస్‌ను మంగళవారం మోదీ సందర్శించారు. ఈసందర్భంగా మోదీ.. ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న వాయుసేన సిబ్బందితో సమావేశమయ్యారు.  వాయుసేన సిబ్బందితో ముచ్చటించి భుజం తట్టారు. ఆపరేషన్ వివరాలను మోదీకి బలగాలు వివరించాయి. గంటన్నరకు పైగా మోదీ అక్కడే గడిపారు. ఆసమయంలో ఆయన ధరించిన టోపీపై త్రిశూల్ చిత్రం ఆకర్షించింది. ’మన దేశ రక్షణ కోసం బలగాలు చేసే ప్రతి చర్యకు ప్రజలందరు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారు‘ అని ఎక్స్ వేదికగా మోదీ ట్వీట్ చేశారు.

Indian Air Force shows its might to Pakistan

More articles

Latest article