ఇందల్వాయి,బతుకమ్మ :
ఉపాధి కోసం గల్ప్ కు వలస వేళ్లిన యువకుడు దుబాయిలో గుండేపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం అలస్యంగా వెలుగు చూసింది. ఇందల్వాయి మండల కేంద్రం కు చెందిన సున్నం రమేష్ (30) అనే యువకుడు బ్రతుకుతెరువు కోసమని దుబాయ్ వెళ్ళాడు. దుబాయ్ లో పని చేసుకుంటున్న సున్నం రమేష్ 30 బాత్రూం లోకి స్నానానికి వెళ్లి స్నానం చేస్తుండగానే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించడం జరిగిందని అతని స్నేహితులు తెలిపినట్లు సమాచారం. శనివారం ఉదయం మృతుని తల్లి భారతికి తెలియడంతో వారి కుటుంబం కన్నీటి పర్యంతం అవుతున్నారు. మృతుని తల్లి, సోదరులు విలపిస్తూ మృతుడు రమేష్ శవాన్ని ఇండియాకు తొందరగా తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విలపిస్తున్నారు.

