ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలంలోని బిక్కనూర్ గ్రామంలో జరుగుతున్న ఉపాధిహామీ పథకం లో భాగంగా ఫార్మషన్ రోడ్డు పనులను మంగళవారం ఉదయం ఇంచార్జి ఎంపిడివో ప్రకాష్ పరిశీలించారు.ఆయన మాట్లాడుతూ.. అధిక సంఖ్యలో కూలీలు హాజరు అయ్యే విధంగా చూడాలని ఫీల్డ్ అసిస్టెంట్ కు సూచించారు. అలాగే కూలీల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎండాకాలంలో సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీవో వినోద్,టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధిహామీ కూలీలు ఉన్నారు.
