26.2 C
Hyderabad
Monday, August 3, 2026

స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాముఖ్యత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: మండల కేంద్రంలోని ఎస్ వి ఫంక్షన్ హాల్ లో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్ ఆధ్వర్యంలో మండల స్థాయి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. మండల కమిటీ యూత్ కాంగ్రెస్అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ఉన్న ప్రాముఖ్యత ఎన్నికల్లో పోటీ చేసేటువంటి యువతకు ప్రతి ఒక్క కార్యకర్త సహకారం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను విస్తృత స్థాయిలో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధికారం మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ ఆలీ షబ్బీర్ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article