వెబ్ న్యూస్,బతుకమ్మ : చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులపై హైడ్రా దృష్టి సారించింది. జూన్ 6 నాటికి చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చెరువులను క్షేత్ర స్థాయిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చెరువుల్లో జరగుతున్న అభివృద్ధి పనుల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
