30.9 C
Hyderabad
Monday, August 3, 2026

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

ఏర్గట్ల, బతుకమ్మ: జిల్లా ఉపాధ్యాయునిగా ఎన్నికైన  ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు  గాండ్ల రాజశేఖర్ కి పాఠశాల తరఫున ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ,భౌతిక శాస్త్రంలో విశేష ప్రతిభ కనబరిచి,విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని గ్రహించి వారి చేత అనేక ప్రయోగాలు చేయించి, విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పించిన ఉపాధ్యాయుడు రాజశేఖర్ కి ఉత్తమ బహుమతి రావడం సంతోషకరమని ప్రధాన ఉపాధ్యాయుడు కృష్ణ చారి తెలిపాడు.దానిలో భాగంగానే పాఠశాల తరఫున సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రసాద్, రాజ నరసయ్య, విజయ్, రాజేందర్, శ్రీనివాస్,గంగాధర్, ప్రవీణ్ శర్మ, ట్వింకిల్,గంగా మోహన్, నరేష్,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article