ఇందల్వాయి,బతుకమ్మ ఇందల్వాయి,మండలంలోని గ్రామాలలో శుక్రవారం ఘనంగా హోళి పండగ సంబరాలు జరుపుకున్నారు. చిన్నా,పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకొని రంగుల మయంలో మునిగితేలారు.గ్రామంలోని యువత కుల, మత చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా హోలీ పండుగ వేడుకలను జరుపుకున్నారు. గంగారం తండా గ్రామంలో బంజారా నాయకులు హోలీ పండగలను నిర్వహించారు. ఈ పండగలలో చందర్ నాయక్, పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు పీర్ సింగ్ నాయక్,ఆల్ ఇండియా బంజారా సేవ నాయకులు మోతిలాల్ నాయక్,ఆలయ కమిటీ చైర్మన్ మోజిరాం నాయక్,మోతిలాల్ నాయక్,రవికుమార్ నాయక్,బలరాం నాయక్, గ్రామలలోని యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.