రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కృష్ణ ఆధ్వర్యంలో ట్రాయి కన్జర్వ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో మేనేజర్ అరుణ్ రైతులతో ముఖాముఖి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రైతులు వ్యవసాయ ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి, నీటి వినియోగాన్ని, పురుగుమందుల వినియోగాన్ని ఎలా తగ్గించాలి అనే అంశాలపై రైతులకు క్లుప్తంగా వివరించారు. అలాగే స్ట్రింగ్ బయో ఉత్పత్తి గురించి రైతుల అభిప్రాయాలు, ఫీడ్బ్యాక్ సేకరించారు. రైతులు ఈ ఉత్పత్తి వాడకం వల్ల వరి పంటలో టిల్లరింగ్, పానికల్స్, దిగుబడి గణనీయంగా పెరిగాయని, అధిక దిగుబడి సాధించామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణ, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
