లింగంపేట్, బతుకమ్మ :
ద్విచక్ర వాహనం నడిపే వారందరూ హెల్మెట్ తప్పని సరిగా ధరించాలని ఎస్సై దీపక్ కుమార్ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గోకుల్ చౌరస్తా వద్ద ఎస్సై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి సర్పంచ్ ప్రత్యూష సాయిరాం గోకుల్ మాజీ సర్పంచ్ రాజయ్య గ్రామస్తులు పాలకవర్గం సభ్యులు తదితరులు ఉన్నారు