. . . రియాజ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్ట్ ల వైరల్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
సీసీఎస్ కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి హత్య చేసిన రియాజ్ ను పోలీసు కాల్పుల్లో హతమవ్వడంతో పోలీస్ శాఖపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు నాలుగు రోజుల వ్యవధిలోనే కానిస్టేబుల్ ను హత్య చేసిన హంతకుడిని ఎన్ కౌంటర్ చేయడంపై హ్యాట్సప్ నిజామాబాద్ పోలీస్ అంటే పోస్టింగ్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఫోటోతో పాటు హంతకుడు రియాజ్ ఫోటోలను కలిసి పోస్టులు చేస్తున్నారు. పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు ప్రారంభం లోని కానిస్టేబుల్ హత్యకు గురికావడంతో దీపావళి పండుగ నాడు నరకసుర వధ జరిగిందంటు పోస్టీంగ్ లు పెట్టారు.
