. . . ఇంటిపై జెండా ఆవిష్కరించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం మిర్చి కంపౌండ్ లో గల తమ ఇంటిపై జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు.
