బతుకమ్మ, బిచ్కుంద : ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరైన లబ్ధిదారులతో కలిసి నిర్మాణ పనులకు కాంగ్రెస్ యువ నాయకులు సాయిని అశోక్ భూమిపూజ చేశారు. బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం పార్టీ నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేసి మాట్లాడారు. సకాలంలో ఇళ్లు పూర్తి చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న రూ. 5 లక్షల ఆర్థిక సాయం పొందాలని కోరారు. ఆ యన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, చింతల హన్మండ్లు, దర్పల్ సంజు, సాయిని బసవరాజ్, బాలకృష్ణ, దర్పల్ గంగాధర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
