- సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ
వెబ్ డెస్క్, బతుకమ్మ : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న వన్డే క్రికెట్ మ్యాచ్ లో దాయాది పై భారత్ ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 42.3ఓవర్లలో చేధించింది. పాకిస్థాన్ పై విరాట్ కోహ్లీ (100నాటౌట్) మరోసారి సెంచరీతో రెచ్చిపోయాడు. ఈ సెంచరీతో వన్డేలో సచిన్ పేరిట ఉన్న 50 సెంచరీల రికార్డును అధిక మించి వరల్డ్ రికార్డు సాధించారు. శుభమన్ గిల్ (46), శ్రేయస్ అయ్యర్ (56) పరుగులు చేసి పాకిస్థాన్ ను టోర్నీ నుంచి ఇంటికి పంపారు.
