భీమ్గల్, బతుకమ్మ : భీమ్ గల్ లింబాద్రి గుట్టపై జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ లక్మీ నరసింహునికి గరుడ సేవ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. రాత్రి కొండపై శ్రీ లక్మీ నరసింహుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో మంగళహారతులు, మేళా తాళాలు, భాజ భజంత్రీలు వెంటరాగా గరుడ వాహనం పై ప్రతిష్టించారు. రంగు రంగుల పూలు, స్వర్ణాభరణాలతో స్వామిని అలంకరించారు. పల్లకిలో ఆశీనులైన శ్రీ లక్మీ నరసింహులను కొండ మాడ వీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమం లో భక్త జనం పాల్గొన్నారు.
