బతుకమ్మ,ముప్కాల్: ముప్కాల్ మండల కేంద్రంలో ఎంపీ నిధుల ద్వారా దూలగుట్ట దగ్గర నిర్మిస్తున్న అమ్మవారి గుడికి అదనపు గది నిర్మాణానికి రూ. నాలుగు లక్షలు, వేంపల్లిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 3.5 లక్షలు మంజూరయ్యాయని బిజెపి ముప్కాల్ మండల అధ్యక్షుడు గడ్డ సంతోష్ రెడ్డి తెలిపారు. వీటికి సంబంధించి పత్రాలను మంగళవారం ఆలయ కమిటీ సభ్యులకు అందించారు.