బతుకమ్మ,వేల్పూర్ :-మండల కేంద్రంలోని గీతా కార్మికులు ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎల్లమ్మ బోనాలను గీతా కార్మికుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని, మహిళలు రామాలయం నుండి ఎల్లమ్మ ఆలయం వరకు బోనాలను తీసుకొని వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఉదయం నుండి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతా కార్మికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
