మహమ్మద్ నగర్, బతుకమ్మ : మహమ్మద్ నగర్ మండలం గాలిపూర్ గ్రామం లో మంగళవారం గీతా జయంతిని గ్రామస్తులు ఘనంగా జరిపారు. ఉదయం హనుమాన్ మందిరం లోని విఠల రుక్మిణి విగ్రహలకు ప్రత్యేక అభిషేకం నిర్వహించి, గోపాల కాల్వలు నిర్వహించి విష్ణు, తులసి లను గద్దె లతో ఊరేగింపు నిర్వహించారు.అనంతరం హన్మాండ్లు మహారాజ్ ప్రవచనం వినిపించి, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో గ్రామస్తులు వెంకట్ రావ్ పంతులు, భూంరెడ్డి, లక్ష్మారెడ్డి, విఠల్, కాశిరం, వెంకట్ రామ గౌడ్, కాశ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

