నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాష్ట్ర ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ డైరెక్టర్ గా ఎంపికైన జిల్లా కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్ ను జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగాధరి సంజీవ్ రెడ్డి, ఉపాధ్యక్షులు గడ్డం సతీష్ రెడ్డి, తాడేం మాజీ సర్పంచ్ జలంధర్ రెడ్డి శనివారం శాలువా తో సన్మానించారు. ఈ సందర్బంగా సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ మున్ముందు మరిన్ని పదవులు ఆశించాలని అలాగే క్రీడాలకు సహకారం అందించాలని కోరామని తెలిపారు.
