ఆర్మూర్, బతుకమ్మ : అంకాపూర్ మాజీ సర్పంచ్ గడ్డం రాజారెడ్డి కాంస్య విగ్రహాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మంగళవారం అంకాపూర్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు పాల్గొని ఆయన గ్రామానికి చేసిన అభివృద్ధి పనులు, సేవ కార్యక్రమాలను స్మరించుకొని నివాళులు అర్పించారు.

