27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులకు ఫుల్ పవర్స్‌

Must read

📰 Generate e-Paper Clip

సీడబ్ల్యూసీ సమావేశంలో ప్రకటించిన మల్లికార్జున ఖర్గే

 వెబ్ న్యూస్, బతుకమ్మ :  కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులకు పవర్స్‌ ఇస్తూ.. అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీ అధ్యక్షులదే తుది నిర్ణయమని సీడబ్ల్యూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. బుధవారం చివరి రోజు సమావేశంలో నాయకులు ఈకీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసందర్భంగా ఖర్గే మాట్లాడారు. ప్రభుత్వ సంస్థలను మోడీ ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. ఓటింగ్‌ యంత్రాల స్థానంలో బ్యాలెట్‌ పేపర్‌ రావాలన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పెద్ద మోసమని, ఈ రోజు కాకపోతే.. రేపు అయినా వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఈ అంశంపై మనం పోరాడాలని పిలుపునిచ్చారు.

More articles

Latest article