బతుకమ్మ, బోధన్: బోధన్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సాధారణ కుటుంబ యువకుడు సాయి వర్ధన్ కృషి, ప్రతిభతో ఎంబీబీఎస్ కోర్సులో ఉచిత సీటు సాధించి స్థానికంగా ప్రశంసలు అందుకున్నాడు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం పొందిన ఈ విజయవార్తతో బోధన్ ప్రజల్లో ఆనందం నెలకొంది. సాయి వర్ధన్ను సామాజిక కార్యకర్త సనా పటేల్ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “పేద కుటుంబానికి చెందిన విద్యార్థి కష్టపడి ఇంతటి విజయాన్ని సాధించడం గర్వకారణం. అయితే అతని ఉన్నత విద్య కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అవసరం. ఇలాంటి ప్రతిభావంతుల విద్యార్థులను దాతలు ప్రోత్సహించాలి” అని అన్నారు.
