మోర్తాడ్, బతుకమ్మ: పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండలంలో మంగళవారం పీ పీ ఆర్ (పారుడు వ్యాధి) నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించినట్లు వైద్యులు గౌతమ్ రాజ్ తెలిపారు. మోర్తాడ్ గ్రామంలో 450 గొర్రెలు, 140 మేకలలో ఉచిత పి.పి.ఆర్ (పారుడు వ్యాధి) వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్. ఏ ప్రభాకర్, జీవాల పెంపకదారులు సందీప్, చిన్న మల్లేష్, ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు.
