మద్నూర్, బతుకమ్మ: అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ నాయకులు మోయిన్ పటేల్ కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరమర్శించారు. మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామంలోని వారి స్వ గృహంలో ఆదివారం వారి కుటుంబ సభ్యులను కలిశారు. మంచి నాయకున్ని కోల్పోయామని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బన్సి పటేల్, కార్యదర్శి గోవింద్ పటేల్, సుల్తాన్ పేట్ మాజీ ఎంపీటీసీ కుటుంబ సభ్యులు దావుద్ పటేల్, షబ్బీర్ పటేల్, మాజీ సర్పంచ్ రాములు, బస్వంత్ రావు పటేల్, గ్రామ అధ్యక్షుడు బాబు పటేల్, రాజేశ్వర్ గౌడ్, నర్సింలు గౌడ్, గఫార్, తదితరులు ఉన్నారు.