వెబ్ డెస్క్, బతుకమ్మ:
అటవీ రేంజ్ అధికారి లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కరీంనగర్ ఎసిబి డిఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఎఫ్ ఆర్ ఓ కార్యాలయంపై దాడి నిర్వహించారు. ఒ వ్యక్తి నుంచి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దిన్ రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.