భీమ్ గల్, బతుకమ్మ : లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహాస్వామి కళ్యాణంను పురస్కరించుకొని వచ్చి పొయ్యే భక్తుల కోసం వాసవి గ్రూప్ భీమ్ గల్ వారి ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని బస్టాండ్ లో అన్నదాన కార్యక్రమంను శుక్రవారం నిర్వహించారు. గత ఏడాది నుండి కళ్యాణం, రాథోత్సవం,జాతరకు రెండు రోజులు పట్టణంలో అన్నదానం నిర్వహిస్తున్నట్లు గ్రూప్ సభ్యులు తెలిపారు. 30 మంది గ్రూప్ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమంను ప్రతియేటా నిర్వహిస్తామని,శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో ఈ అన్నదాన పంపిణి అవకాశం దొరకడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
