ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని సిర్నపల్లి గ్రామనికి చెందిన మార్కల రాజు ఇల్లు ఇటీవల అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధం అయిన విషయం తెలుసుకున్న బిజెపి మండల నాయకులు బీజేపీ అధ్యక్షులు దినేష్ కుమార్ కూలచారి పుట్టిన రోజు సందర్భంగా ఇంధల్వయి మండల బీజేపీ పార్టీ సభ్యులు రాజు కుటుంబానికి పదివేల రూపాయలతో పాటు నిత్యావసర సరుకులు అందించడం జరిగినదని పార్టీ మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి ఉప్పు సవిత మండల బీజేపీ సీనియర్ నాయకులు గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.