బతుకమ్మ, మెండోరా: మెండోరా మండల కేంద్రానికి చెందిన చిన్న మరెన్న ఇటీవల ప్రమాదవశాత్తు కాకతీయ కాలువల పడి చనిపోవడం జరిగింది. వారిది నిరుపేద కుటుంబం.. కనీసం దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేకపోవడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ విషయాన్ని తెలుపగా ఆయన రూ.10,000 ( పదివేల రూపాయల) ఆర్థిక సహాయాన్ని పంపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబానికి అందించడం జరిగింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
