- యూరియా కోసం రైతులు పడిగాపులు
- జిల్లావ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఇబ్బందులు
బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని కాచాపూర్ గ్రామ సొసైటీ ముందర రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు. రైతులు మాట్లాడుతూ 15 రోజుల నుండి యూరియా కోసం ప్రతిరోజు పడి గాపులు కాస్తున్నామన్నారు. వ్యవసాయ పనులు ఊపాందుకోవడంతో యూరియా అవసరం బాగా పెరిగింది అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. లేనిపక్షంలో మరోసారి ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరించారు.