ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి

0 14,549

మెండోరా, బతుకమ్మ: మెండోరా మండలంలోని ఎస్సా ఎస్పీ పాఠశాలలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత వివరిస్తూ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మన ఇచ్చిన హక్కులు వాటి ప్రాధాన్యతలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సబ్ ఇన్స్పెక్టర్ సుహాసిని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను మారకద్రవ్యాలకు దూరంగా ఉండాలని హక్కులను, బాధ్యతలను గుర్తెరిగి నడుచుకోవాలని పిల్లలకు తెలియపరచాలని గుర్తు చేశారు. అనంతరం మెండోరా ఎస్సైని శాలువాతో ఘనంగా సన్మానించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.