- మండల విద్యాశాఖ అధికారి దేవిసింగ్
బతుకమ్మ పిట్లం : సమావేశాలకు అందరూ హాజరు కావాలని మండల విద్యాశాఖ అధికారి దేవిసింగ్ అన్నారు. పిట్లం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిట్లంలో ప్రాథమిక స్థాయి కాంప్లెక్స్ సమావేశం గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో టి యల్ టి బోధన ఉపకరణాలు,ప్రజ్ఞోత్సవం పై ప్రతి పాఠశాల నుండి ప్రాతినిధ్యం వహించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి దేవిసింగ్ మాట్లాడుతూ విద్యార్థులకు బోధనా ఉపకరణాలు ఉపయోగించి కనీస సామర్థ్యాలు వచ్చేలా విద్యా బోధన చేయాలని సూచించారు. అనంతరం మండల నోడల్ అధికారి రమణారావు పాఠశాలల వారీగా రివ్యూ చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్న కొడప్గల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సి ఆర్ పి లు హైమద్ భాషా, విట్టవ్వ పాల్గొన్నారు.
