అంబర్ పేట్, బతుకమ్మ : ఏసీబీ అధికారులు సోమవారం జీహెచ్ఎసంసీ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇంజనీరింగ్ ఏఈ మనీషా రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బిల్లుల మంజూరు కోసం కాంట్రాక్టర్ వద్ద ఏఈ మనీషా లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం ఏఈ మనీషా లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఈ మనీషా ఇప్పటికే రూ.5వేలు లంచం తీసుకున్నట్లు తెలిసింది.
