29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

నిజాంసాగర్ కెనాల్ కాలువపై కబ్జాలను తొలగించాలి 

Must read

📰 Generate e-Paper Clip

  • ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో  తహసిల్దార్ కి వినతి పత్రం

బతుకమ్మ నిజామాబాద్ : నిజాంసాగర్ కెనాల్ కాలువపై కబ్జాలను తొలగించాలని  ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో  తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. మాక్లూర్ మండల్ దాస్ నగర్ వద్ద ఉన్న నిజాంసాగర్ కెనాల్ 68 వ నాలువ డిస్ట్రిబ్యూటర్ ద్వారా రైతులు కెనాల్ నాలువ ఎకరాలు సాగు చేస్తున్నారన్నారు. అక్కడ అక్రమంగా వెంచర్లు సాగు చేశారని తెలిపారు. కాలువ కబ్జా చేశారని తెలిపారు. జాతీయ రహదారి పక్కన మూడు కిలోమీటర్లు దాస్ నగర్ నుంచి మాణిక్ బండారు వరకు సుజిత్ ఫ్యాక్టరీ నాలువ పులంగ్ వాగువరకు కబ్జాయిందని తెలిపారు. కాలువలు కబ్జా చేసి బిల్డింగులు నిర్మించాని తెలిపారు. కబ్జాకు గురైన నిజాంసాగర్ కాలువను నవ్య భారతి స్కూల్ వద్ద కబ్జా గురైందని తెలిపారు. కాలువలను సర్వే చేసి చర్యలు తీసుకోవాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ వినతి పత్రం ఇచ్చారు.

More articles

Latest article