- కాపర్ కాయిల్ చోరీ
బతుకమ్మ, భిక్కనూరు: గుర్తు తెలియని దుండగులు వ్యవసాయ క్షేత్రంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో కాపర్ కాయలను దొంగిలించిన ఘటన భిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వేకువ జామున సోమవారం చోటుచేసుకుంది. బాధితులు పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామేశ్వర్ పల్లి శివారులోని జమగనిపట్ల వెంకటేష్ గౌడ్ చెందిన వ్యవసాయ క్షేత్రాలలో ట్రాన్స్ఫార్మర్ గుర్తు తెలియని వ్యక్తులు కింద పడేసి అందులోని కాపర్ వైర్ చేశారు. ఈ మేరకు బాధితులు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
