26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఉపసర్పంచుల ఫోరం మండల నూతన కమిటీ ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

 

లింగంపేట్, బతుకమ్మ :

 

లింగంపేట్ మండల ఉప సర్పంచ్ ల ఫోరమ్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఉప సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు ప్రసాద్ గౌడ్ తెలిపారు. స్థానిక రామాలయంలో బుధవారం సమావేశాన్ని నిర్వహించి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. మండల శాఖ అధ్యక్షుడిగా మన్నె బాలయ్య (శెట్పల్లి), ఉపాధ్యక్షులు మామిడి సంజీవ్ (ఐలాపూర్), మాసన్న గారి కిష్టయ్య (సజ్జనపల్లి), ప్రధాన కార్యదర్శి సంద బాలయ్య (పోతాయిపల్లి), వర్కింగ్ ప్రెసిడెంట్ రమావత్ పీర్య (కొట్టాల్ గడ్డ తాండ), కోశాధికారి కలాలు బాలాగౌడ్ (మెంగారం), కార్యదర్శి బిట్ల రాజు (ముస్తాపూర్), కల్లు రాజు ( జల్దిపల్లి) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వెల్లడించారు. నూతనగా ఎన్నికైన వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article