నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు జిల్లా టీపీటీఫ్ ఎన్నికలు శనివారం నగరంలోని శంకభవన్ పాఠశాలలలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. మహేందర్ రెడ్డి పర్యవేక్షణ లో నిర్వహించారు. ఈ సదర్బంగా జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా వెనిగల్ల సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పూదరి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులుగా బి.మల్లేశం, భారతి, ఇబ్రహీం, కే.గంగా ప్రసాద్, జిల్లా కార్యదర్శులుగా పి.రేణుక, ఎం. సురేష్, నరేందర్, బి.రామకృష్ణ, లను జిల్లా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఏన్నుకున్నారు.


