వెబ్ న్యూస్, బతుకమ్మ : టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిలను తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, మరకంటి భవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా గడుగు గంగాధర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కౌన్సిల్లో మహిళా సాధికారతపై చర్చించడం అభినందనీయమన్నారు. మహిళా సాధికారతకు అందరం కలిసి కృషి చేస్తే సమాజంలో మార్పులు వస్తాయన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు పేర్కొన్నారు.
