24.7 C
Hyderabad
Monday, August 3, 2026

బాలికల అభ్యున్నతికి కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

. . . కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బాలికల పట్ల వివక్షతను ప్రదర్శించకుండా వారి అభ్యున్నతికి కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ నగరంలో చేపట్టిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుండి ప్రధాన వీధుల మీదుగా న్యూ అంబేద్కర్ భవన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. బేటీ బచావో – బేటీ పడావో, బాలికలను రక్షిద్దాం అని నినాదాలు చేస్తూ విద్యార్థినులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ రసూల్ బీ, జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్, విద్యార్థినులు పాల్గొన్నారు.

 

 

Efforts should be made for the advancement of girls.
Efforts should be made for the advancement of girls.

More articles

Latest article