వేల్పూర్, బతుకమ్మ: మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామన్నపేటలో ధరిత్రి దినోత్సవం ను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులచే గాలి, నీరు, భూమి,ప్రకృతి వనరులను కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేయించారు.ఎకో క్లబ్ ల ద్వార వృక్షజాలం కోసం క్యు.ఆర్ కోడ్ లు అనే కార్యక్రమం లో భాగం గా విద్యార్ధులు పాఠశాల ప్రాంగణం లోని చెట్లకు క్యూ. ఆర్ కోడ్ లను రూపొందించారు.దీని ద్వారా పర్యవరణ అభ్యాసనాన్ని డిజిటల్ నైపుణ్యంతో కలాపదం ద్వార ప్రభావవంతం గా ఉంటుందన్నారు.ఈ క్యు.ఆర్ కోడ్ లు చెట్టు పేరు,జాతులు,లక్షణాలు వాటి ఉపయోగాలను గురుంచి సమాచారమును తక్షణమే పొందేలా చేస్తాయని హెచ్. ఎం కె.శివాజీ,ఎకో క్లబ్ ఇంచార్జి ఉపాధ్యాయులు ఆర్.శ్రీకాంత్ విద్యార్థులకు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయబృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
