ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ప్రజా పాలనలో భాగంగా బుధవారం ఇ -ఆఫీస్ ఫైల్స్ ను తనిఖీ చేసారని కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి శంకరయ్య తెలిపారు. ఇ -ఆఫీస్ ఫైల్స్ ను కళాశాల అధ్యాపకులు డాక్టర్ జి సిద్దు రాజు గణిత శాస్త్ర విభాగం, సురేష్ రెడ్డి కంప్యూటర్ అధ్యాపకులు టీఎస్కేసీ మెంటార్ రాజు తనిఖీ చేసారు. ఈ తనిఖీ లో కళాశాల అర్థ శాస్త్ర విభాగం ఇ -ఆఫీస్ ను, మిగతా అన్ని డిపార్ట్మెంట్ లను తనిఖీ చేసారు. ఇందులో కళాశాల అర్థ శాస్త్ర విభాగం అధిపతి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ తనిఖీ లో కళాశాల సూపరింటెండెంట్ వసంత లక్ష్మి, కళాశాల ఆఫీస్ సిబంది పాల్గొన్నారు.
