బతుకమ్మ,మెండోరా: మెండోరా మండలం దూదిగాం గ్రామానికి చెందిన యువకులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రశాంత్, సురేష్ అనే యువకులు ద్విచక్ర వాహనంపై బుధవారం రాత్రి ఎన్ హెచ్ 44 రోడ్డుపై నుంచి దూదిగాం గ్రామానికి వైపు వస్తుండగా ముప్కాల్ శివారులో గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రశాంత్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం తరలించారు.
