28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఈత మొక్కలను నాటిన డీపీఓ

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని పురానిపేట్ గౌడ్ సొసైటీ భూమిలో గురువారం నిర్వహించిన ఈత ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా మండల స్పెషల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ శ్రీనివాస్ రావు ఈత మొక్కలను నాటారు. ఈత ప్లాంటేషన్ గౌడ్ కమ్యూనిటీకి భవిష్యత్ లో ఎంతో ఆర్ధిభివృద్ధినిస్తుందని అన్నారు. ఈ ప్లాంటేషన్ ను భాద్యతగా పరిరక్షించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, ఉపాధి ఏ పీ ఓ జి. నర్సయ్య,ఎక్స్సైజ్ సీ ఐ, ఎస్సై, సిబ్బంది, జీ. పీ సెక్రటరీ, ఉపాధి సిబ్బంది, జీపి సిబ్బంది, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article