మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి షేక్ సలాం బుధవారం సందర్శించారు. తరగతి గదులను తిరిగి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్ధులను నేరుగా పలు ప్రశ్నలను అడిగి సంతృప్తిని వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలను చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ పాండు రంగ్ , అధ్యాపకుల బృందం ఉన్నారు.
