28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ఖేలో ఇండియా సెపక్ తక్రాకు జిల్లా క్రీడాకారుల ఎంపిక

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈ నెల 4 నుండి బీహార్ లోని పట్నాలో జరిగే అండర్ 18 సెపక్ తక్రా ఖేలో ఇండియా టోర్నమెంట్ కు జిల్లా నుండి ఇద్దరు క్రీడాకారులు ఎంపికయినట్లు జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, రాష్ట ఉపాధ్యక్షులు గాధరి సంజీవ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికయినా క్రీడాకారులు అన్నం సాత్విక్ రెడ్డి, బాలికల విభాగం లో నల్ల భవ్య శ్రీ ఎంపికయ్యారని వీరు పట్నా లో జరిగే టోర్నమెంట్ లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఎంపికయినా క్రీడాకారులు ఖేలో ఇండియా టోర్నమెంట్ లో రాణించి జిల్లాకు పేరు తీసుక రావాలని సూచించారు.

 

More articles

Latest article