26.3 C
Hyderabad
Monday, August 3, 2026

భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో మంగళవారం గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుకు దోహదం చేసేలా ప్రభుత్వ పాఠశాలల్లో జ్ఞానమైన విద్యా బోధన అందిస్తున్నారన్నారు. ప్రవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దానే రాజయ్య, వార్డ్ మెంబర్ ముకుంద సుధాకర్ రావు, ప్రధానోపాధ్యాయులు లోకేశ్వర్, ఉపాధ్యాయులు మాలతి, చింతాల లింగం, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article